జార్ఖండ్లో మరో ఎన్కౌంటర్.. మావోయిస్టు గడ్చిరోలి మహిళా నేత నటాషా మృతి
దిశ, తెలంగాణ బ్యూరో: జార్ఖండ్ రాష్ట్రం సరాండా అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్ లో జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ(…
దిశ, తెలంగాణ బ్యూరో: జార్ఖండ్ రాష్ట్రం సరాండా అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్ లో జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ( డీకేలో అయితే స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణలో అయితే రాష్ట్ర కమిటీ) సభ్యుడు అనూజ్ దా అలియాస్ సహదేవ్ మహతో అలియాస్ సుభాష్తో పాటు ఆయన భార్య, అదే స్థాయికి చెందిన నటాషా మరణించారు. ఈ ఎన్కౌంటర్ ఈ వారంలో జరిగిన రెండవ ఘటన కావడం గమనార్హం. అనూజ్ దా స్వస్థలం జార్ఖండ్ రాష్ట్రం హజారీభాగ్…
మావోయిస్టులు పరాజయం పొందడం వెనకాల ఉన్న ప్రధాన కారణాలను గత వారం రాశాను. ఈ వారం ఆ ఓటమిని సైనికంగా విశ్లేషిస్తాను. గత వారం పొందిన అనుభవం దృష్ట్యా.. ఈ సైనిక సమీక్ష రాయడానికి నాకున్న అర్హతలను పాఠకులకు చెప్పడం బాధ్యతగా భావిస్తాను. పూర్తికాలం కార్యకర్తగా 1983లో పార్టీలో చేరి 1988 నుంచి మిలిటరీ సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొన్నాను. ఆ సంవత్సరమే ప్రారంభమైన ‘‘జంగ్’’ మిలిటరీ పత్రికలో పనిచేశాను. 1989 మిలిటరీ క్యాంపులో శిక్షణ పొందిన అనంతరం…
మావోయిస్టు పార్టీ ఓటమిపై నేను రాజకీయ విశ్లేషణ రాసిన తర్వాత నా పైన కొందరు అప్రజాస్వామికంగా దాడి చేస్తున్నారు. వారు ప్రజాస్వామికంగా నేను రాసిన విషయాలను విభేదిస్తూ, విమర్శిస్తూ ఏమైనా రాసుకోవచ్చు. కాని నా పైన వ్యక్తిగత దాడి చేస్తూ నన్ను బాధ పెడుతున్నారు. నేను పార్టీలోకి వెళ్లిందీ, తిరిగివచ్చిందీ ఏ పరిస్థితుల్లో అనే వివరాలు నేను రాసిన సంపాదకీయాల(నమస్తే తెలంగాణ ఎడిట్ పేజీలో వచ్చాయి.) సంపుటి మలుపు పబ్లికేషన్స్ నుంచి వచ్చిన ’’మరోకోణం‘‘ అనే పుస్తకంలో…
ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ రాజకీయంగా, సైనికంగా పొందిన ఓటమి గురించి సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు, విశ్లేషణలు, సిద్ధాంతీకరణలు కొనసాగుతున్నాయి. ఈ దెబ్బతో భారతదేశంలో ఐదు దశాబ్దాలుగా నడుస్తున్న మావోయిస్టు ఉద్యమాల చరిత్ర ఇక అంతమైనట్లేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. సమీప భవిష్యత్తులో విప్లవోద్యమాలను ఆశించడం ఎండమావి లాంటిదేనంటున్నారు. ఒకప్పుడు మనిషి జీవితం సమాజం చుట్టూతా తిరిగితే ఇప్పటి తరం తన చుట్టూ తానే అల్లుకుని బతుకుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. తను బాగుంటే చాలని, చుట్టుపక్కల మనుషులు…
(దూడం మార్కండేయ) గురువారం సీపీఐ ఆఫీసుకు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి తదితరులు వస్తారని వచ్చిన వార్తల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఏ కారణం వల్లనో వారి ఆ సందర్శన రద్దయినా, చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. గత నెలాఖరులో రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి సమక్షంలో లొంగిపోయిన దేవ్జీ వర్గం.. తాము రాజకీయ జీవితం కొనసాగిస్తామని, చట్టబద్ధమైన పద్ధతుల్లొ ప్రజల పక్షాన పోరాడతామని చెప్పిన విషయం తెలిసిందే. వీరి లొంగుబాటు సమయంలో ఆయుధాలు అప్పగించక…
(దూడం మార్కండేయ) ఎప్పుడా అంటూ దేశమంతా ఎదురుచూసిన ఆ క్షణం రానే వచ్చిందనుకున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో మావోయిస్టుల భారీ లొంగుబాట్లు ఉంటాయని మీడియాకు సమాచారం వచ్చిన వెంటనే ఊహాగానాలు మొదలయ్యాయి. సీఎం సమక్షంలో అంటున్నారు కనుక తప్పనిసరి ఆ దళపతి ఉంటాడనుకున్నారు. తీరా చూస్తే 130 మంది వివిధ స్థాయిలకు చెందిన నక్సలైట్లు 124 వివిధ రకాల ఆయుధాలతో లొంగిపోయారు. కాని ఆ సుప్రీం జాడే లేదు. కొండపల్లి…
అడవులు, మైదానాల్లో పనిచేస్తున్న మావోయిస్టు నేతలు, కేడర్లకు లొంగుబాటు-పునరావాసం పథకాలను ప్రకటించి అమలు చేస్తున్న ప్రభుత్వాలు ఇక నుంచి జైలులో ఉన్న కార్యకర్తలకూ వాటిని వర్తింపజేయనున్నాయి. ఈ మేరకు ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో రాయపూర్లో జరిగిన సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ముందుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అమలయ్యే ఈ విధానాన్ని క్రమంగా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించనున్నట్లు ఛత్తీస్గఢ్ వర్గాలు పేర్కొన్నాయి. జైళ్లలో వందలాది మావోయిస్టులు.. బిహార్, జార్ఖండ్, బెంగాల్, ఛత్తీస్గఢ్,…
మావోయిస్టు పార్టీకి షెల్టర్ జోన్గా తెలంగాణ ఉపయోగపడుతోందా? ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ దాడులు తీవ్రంగా కొనసాగుతున్న వేళ.. మిగిలిన మావోయిస్టులందరూ సరిహద్దు దాటి ఇటువైపు వచ్చారా? కొంతకాలం కర్రెగుట్టల్లో తలదాచుకుని ఇప్పుడు తెలంగాణలోని వివిధ జిల్లాలకు చేరారా? అగ్రనేతలు దేవ్జీ, దామోదర్, పాపారావు కూడా వీరిలో ఉన్నారా? అంటే అవుననే అంటున్నారు మావోయిస్టు వ్యవహారాల విశ్లేషకులు. ఇటీవల డీజీపీ ఎదుట లొంగిపోయిన ఫస్ట్ బెటాలియన్ కమాండర్ బార్సె దేవా చెప్పిన అంశాలు ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయని వాళ్లంటున్నారు….
మావోయిస్టు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) ఫస్ట్ బెటాలియన్ కమాండర్ బార్సె దేవా, మరికొందరు సభ్యులు తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేత, కేంద్రకమిటీ, పొలిట్బ్యూరో సభ్యుడు దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఎక్కడ ఉన్నాడనే చర్చ మరోమారు జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, కాకినాడ, ఏలూరు పట్టణాల్లో జరిగిన మావోయిస్టుల అరెస్టుల సందర్భంలో దేవ్జీ కూడా వారిలో ఉన్నాడనే చర్చ జరిగింది. ఆయన ప్రాణాలకు…
ఒడిషాలోని కందమాల్ జిల్లాలో ఈరోజు జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు ఉయికె గణేశ్@పాక హన్మంతు మరణించాడు. గణేశ్ మృతితో మావోయిస్టు పార్టీకి నాయకత్వం వహిస్తున్న కేంద్రకమిటీలో ప్రస్తుతం ఐదుగురే మిగిలారు. గణపతి@ముప్పాళ లక్ష్మణ్రావు, సంగ్రామ్@మల్లా రాజిరెడ్డి, దేవ్జీ@తిప్పిరి తిరుపతి తెలంగాణ వాళ్లు కాగా, సాగర్@మిసిర్ బెస్రా, ఆనల్ దా@పతీరాం మాంఝీ బిహార్, జార్ఖండ్కు చెందిన వాళ్లు. 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత కార్యదర్శి బసవరాజు@నంబళ్ల కేశవరావు, మిలిటరీ చీఫ్ హిడ్మా సహా…