Friday, July 5, 2024

నక్సల్స్ పై ‘మానవరహిత’ యుద్ధం..

మావోయిస్టుల వేటలో మానవరహిత విమానాలను వాడాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి రెండేళ్ల క్రితమే ఛత్తీస్‌గఢ్ లోని బస్తర్ అటవీ ప్రాంతంలో ప్రయోగాత్మక పరీక్షలు చేసింది. దంతేవాడ జిల్లా చింతల్‌నార్‌లో మావోయిస్టులు చేసిన దాడిలో 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించిన నేపథ్యంలో మొదటిసారి 2010 ఏప్రిల్ 14న అమెరికా తయారీ టీ-హెచ్‌ఎంఏవీ రకం మానవ రహిత విమానాన్ని బస్తర్ అడవుల మీదుగా గంట ల పాటు తిప్పారు. విమానం పంపిన చిత్రాలు, వీడియో ఫుటేజీ ఆధారంగా మావోయిస్టుల స్థావరాలను, కదలికలను,మందుపాతరలను ఏ మేరకు గుర్తించవచ్చునో అంచనా వేశారు. ఫలితాలు సంతృప్తికరంగా లేకపోవడంతో ‘రా’ ఆధ్వర్యంలో పనిచేసే జాతీయ సాంకేతిక పరిశోధనా సంస్థ(ఎన్‌టీఆర్‌ఓ) వద్ద ఉన్న మరికొన్ని రకాల విమానాలను సైతం ఈ అడవులపై ప్రయోగించి చూశారు. ఇవేవీ దట్టంగా ఉన్న అడవిలో నక్సల్స్ కదలికలను పసిగట్టలేకపోయాయి. తర్వాత 2011 డిసెంబర్‌లో ఇజ్రాయెల్‌లో తయారైన హెరాన్ మానవ రహిత విమానాలను హైదరాబాద్‌లోని బేగంపేట విమానాక్షిశయం నుంచి ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, గడ్‌చిరోలి, ఏటూరు నాగారం అడవులపై పలుమార్లు ప్రయోగించి సంతృప్తికరమైన ఫలితాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో హెరాన్ విమానాలను మావోయిస్టుల వేటకు ఉపయోగించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది.

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో ఉన్న ‘జంగిల్ వార్‌ఫేర్’ స్కూలు నుంచి, జగ్దల్‌పూర్ విమానాక్షిశయం నుంచి ఈ విమానాలు పనిచేస్తాయి. రాజమండ్రి సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న మధురపూడి విమానాక్షిశయంలో రూ 30 కోట్ల విలువ చేసే ఒక మానవ రహిత హెరాన్ విమానాన్ని మోహరిస్తున్నట్లు, దీని సహాయంతో విశాఖ ఏజెన్సీలోనూ, ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు(ఏఓబీ)వూపాంతంలోనూ మావోయిస్టుల ఆట కట్టించనున్నట్లు మన రాష్ట్ర డీజీపీ దినేష్‌డ్డి ప్రకటిస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు యుద్ధశాస్త్రంలో మానవ రహిత విమానాల యుగం నడుస్తోంది. ‘అన్‌మాన్‌డ్ ఏరియల్ వెహికిల్’ (యుఏవీ) లేదా ‘డ్రోన్’గా పిలిచే ఈ విమానాలను మొదట 1916లో అమెరికా కనుగొన్నది. ప్రాబల్య శక్తులుగా ఉన్న అనేక దేశాలు ప్రస్తుతం ఈ విమానాలను తయారుచేస్తున్నప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్‌లు ఈ రంగంలో పేరుపొందాయి. ఈ విమానాలు నాలుగువేల నుంచి 40 వేల అడుగుల ఎత్తు వరకు జెట్ ఇంజిన్ సాయంతో ఆకాశంలో ఎగురుతూ వాటిలో అమర్చిన ఇన్‌ఫ్రా రెడ్ కెమెరాలు, రాడార్లు, సెన్సర్లు, స్కానర్ల సాయంతో శత్రువు గురించిన సమాచారాన్ని లైవ్‌గా గ్రౌండ్ స్టేషన్‌కు పంపిస్తాయి. లక్ష్యాల ధ్వంసానికి క్షిపణులు, బాంబులను ప్రయోగించే మాన వ రహిత విమానాలను అన్‌మాన్‌డ్ కంబాట్ ఏరియల్ వెహికిల్ (యుసీఏవీ) అనీ, టార్గెట్ తో పాటు తామూ ధ్వంసమయ్యే విమానాలను ‘కమికాజె’లనీ, అతి తక్కువ బరువు కలిగిన తేలికరకం విమానాలను మైక్రో ఏరియల్ వెహికిల్ (ఎంఏవీ) అనీ, తక్కువ ఎత్తులో ఎక్కువ కాలం గాలిలో ఎగిరే రకాలను ‘మేల్’ (మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూన్స్)లనీ వ్యవహరిస్తున్నారు.

1999లో కార్గిల్ యుద్ధానంతరం మన దేశం మానవ రహిత విమానాల ఆవశ్యకతను గుర్తించింది. పార్లమెంటు భవనంపై 2002లో ఉగ్రవాదులు చేసిన దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్ నుంచి వంద సెర్చర్, హెరాన్ రకం యుఏవీలను, హార్పీ, హరోప్ రకం కమికాజెలను కొనుగోలు చేసింది. ఆ దేశ సహకారంతో మన రక్షణశాఖ ఆధ్వర్యంలో పనిచేసే డీఆర్‌డీఓ లక్ష్య, నిశాంత్, రుస్తోం, పవన్, గగన్ వంటి పలు రకాల యుఏవీలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోంది. భారత సైన్యాన్ని అవసరాలకు దీటుగా ఆధునీకరించేందుకు వచ్చే 12 ఏళ్లలో 10 లక్షలకోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ప్రభుత్వం తలపెట్టగా ఈ మొత్తంలో అధిక భాగాన్ని మానవరహిత విమానాల కొనుగోలుకు, అభివృద్ధికి కేటాయించారు. ప్రస్తుతం భారత వైమానిక దళం వంద సెర్చర్ యుఏవీలతో పాక్, చైనా, నేపాల్, బర్మా, బంగ్లా సరిహద్దుల్లో సమాచార సేకరణ, నిఘా కార్యకలాపాలను నిర్వర్తిస్తోంది.12వ పంచవర్ష ప్రణాళిక ముగిసే నాటికి జమ్మూ-కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ప్రతి బెటాలియన్ ఆధీనంలోనూ ఓ ఎంఏవీ ఉండేలా ప్రతిపాదనలు రూపొందించింది.

యుఏవీలను ఉపయోగించి పాక్-అఫ్ఘాన్ సరిహద్దుల్లో తాలిబన్, అల్ ఖాయిదా ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేయడంలో అమెరికా సాధించిన విజయాలు నక్సల్స్ వేటలో మానవ రహిత విమానాలను వినియోగించవచ్చన్న ఆలోచనలకు బీజం వేశాయి. ‘బహుళజాతి’ మిత్రులు మన్మోహన్, చిదంబరానికి ఇది సహజంగానే ఉత్సాహపరచింది. ఖనిజ వనరులు అధికంగా గల మధ్య భారత అడవుల్లో ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను ప్రారంభించాడు. అది అనుకున్న ఫలితాలను సాధించకపోగా మావోయిస్టుల దాడుల్లో భారీ సంఖ్యలో జవాన్లను కోల్పోతుండడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో యుఏవీల మోహరింపునకు తెరతీశాడు. శత్రు దేశాల బలగాలపై ప్రయోగించాల్సిన అస్త్రాన్ని తన స్వంత ప్రజలపై సంధించడానికి సిద్ధపడ్డాడు. ఈ విమానాలను నక్సల్స్ సమాచార సేకరణకే కాకుండా అవసరమైతే వారి స్థావరాలపై బాంబు దాడులు చేయడానికి కూడా వాడుకోవాలని ఆయన వాదించినట్లు, అందు కు కేబినెట్ కమిటీ నిరాకరించినట్లు సమాచారం. గ్రీన్‌హంట్‌లో భాగంగా సైన్యాన్ని దింపడాన్ని గతంలో వ్యతిరేకించిన త్రివిధ దళాధిపతులు, రక్షణ మంత్రి ఆంటోనీ తదితరులు యుఏవీలను దాడుల కోసం వాడవద్దని, ప్రస్తుతానికి సమాచార సేకరణకు మాత్రమే పరిమితం చేయాలని షరతు విధించినట్లు తెలుస్తోంది.

ప్రిడేటర్ యుఏవీలతో తాలిబన్-అల్‌ఖాయిదా స్థావరాలపై అమెరికా చేసిన దాడుల్లో ఉగ్రవాదులే కాకుండా వేలాదిమంది ప్రజలు చనిపోయారు. 40వేల అడుగుల ఎత్తున విహరించే విమానం నేలపై సంచరించే మానవుల్లో ఉగ్రవాదులు ఎవ రు? మామూలు పౌరులు ఎవరన్న విషయంలో స్పష్టమైన సమాచారం అందించే అవకాశం లేదు. డాటాను విశ్లేషించే సిబ్బంది ఏమాత్రం పొరబడినా సామాన్య ప్రజ లు సమిధలుగా మారతారు. 2011 డిసెంబర్ రెండవ వారంలో దంతేవాడలో జరిగిన ఓ ఘటన మన భవిష్యత్ చిత్రపటాన్ని ఆవిష్కరిస్తుంది. పరీక్ష కోసం పంపిన యుఏవీ జిల్లాలోని తెరివాల్ గ్రామ పరిసర అడవుల్లో మావోయిస్టుల క్యాంపు ఉన్నట్లు గుర్తించింది. కొన్ని గుడిసెలు, టెంట్లు ఉన్నాయని, ఎక్కువ సంఖ్యలో మనుషులు తిరుగుతున్నారని అది పంపిన విజువల్స్ ఆధారంగా అంచనా వేశారు. ఈ సమాచారం ఆధారంగా కొన్ని బలగాలను హుటాహుటిన కాలిదారిన పంపిన అధికారులు హెలికాప్టర్లలో కమాండోలను సైతం రంగంలో దించారు. తీరా అక్కడకు వెళ్లిచూస్తే అదో ఆదివాసీ గ్రామం. రాబోవు కాలంలో నక్సల్ ప్రాబల్య ప్రాంతాల్లో ఏం జరగబోతోందో ఈ ఘటన మనకు తెలియజెబుతుంది. ఉద్యమాల అణచివేత పేరిట, ఉగ్రవాద నిర్మూలన పేరిట దేశంలోని వివి ధ ప్రాంతాల్లో సైనిక, పారామిలిటరీ, పోలీసు బలగాలు చేబట్టిన చర్యలన్నింటిలోనూ అకృత్యాలు, అరాచకాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయి. ఉద్యమకారుల చేతుల్లో ప్రభుత్వ బలగాలు దెబ్బతిన్నప్పుడల్లా మామూ లు ప్రజలు సమిధలు కావడమూ మనకు తెలుసు. సింగారం,గోంపాడు,సింగనమడుగులో ఇదే జరిగింది. కాశ్మీర్‌లో, ఈశాన్యంలోను ఇలాంటి ఎన్నో ఘటన లు జరిగాయి. గ్రీన్‌హంట్‌లో భాగంగా ఆగస్టు 10, 2009 నుంచి డిసెంబర్ 31, 2010 వరకు ఒక్క దండకారణ్యంలోనే 11 మంది నిరాయుధులు ప్రభుత్వ బలగాల చేతిలో ప్రాణాలు కోల్పోయారని పౌరహక్కుల సంఘాల నివేదికలు చెబుతున్నాయి.

యుక్తాయుక్త విచక్షణ కలిగిన మానవమావూతులు పాల్గొంటున్న చర్యల్లోనే పరిస్థితి ఇలా ఉంటే యంత్రా లు ఇచ్చిన సమాచారంతో హెలికాప్టర్లలో వెళ్లిన బలగాలు విచక్షణారహితంగా జరిపే కాల్పులు ఎలాంటి ఉల్లంఘనలకు దారితీస్తాయో, ఎందరిని బలి తీసుకుంటాయో!మధ్యభారతంలో అపారంగా నిక్షిప్తమై ఉన్న ఖనిజనిల్వలను బహుళజాతి కంపెనీలకు అప్పనంగా కట్టబెట్టే క్రమానికి అడ్డుపడుతున్న విప్లవోద్యమం లక్ష్యంగా ప్రస్తుత యూపీ ఏ ప్రభుత్వం పనిచేస్తున్నది. మన్మోహన్ వ్యాఖ్యలనైనా, చిదంబరం చేతలనైనా, గ్రీన్‌హంట్ లక్ష్యాలనైనా మనం ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాల్సివుంటుంది. ఒక్క దండకారణ్యంలోనే 60వేల పారా మిలిటరీ బలగాలను దించినా, వైమానిక దళ సేవలను వినియోగించుకున్నా, శిక్షణ పేరుతో సైన్యాన్ని దించినా సాధించలేని ఫలితాలను మానవ రహిత విమానాల ద్వారా సాధిస్తామనుకోవడం భ్రమే. ప్రజల మద్దతు ఉన్నంతవరకు మావోయిస్టుల కార్యకలాపాలను నియంవూతించడం ఎవరి తరమూ కాదు. ప్రజల అవసరాలను, ఆకాంక్షలను పట్టించుకుని, వారెదుర్కొంటున్న మౌలిక సమస్యలను పరిష్కరించాలి. అణచివేతకు కేటాయించే నిధులను ఆదివాసీల అభివృద్ధికి ఖర్చు చేయాలి. ప్రజల ఆకలి పోరాటాన్ని ఆయుధంతో కాకుండా అన్నం,అభివృద్ధితో పరిష్కరించాలి.

 

Latest News